వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్: రేపే ప్యాకేజీకి చట్టబద్దత!..

గత రెండు రోజులుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ అధికారులతో మంతనాలు జరుపుతున్న సుజనా చౌదరి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాల్సిందిగా వారికి విన్నవించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని సహా పలు సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం గతంలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కావాలని ఏపీ జనం కాంక్షించినా.. అది ఇప్పట్లో సాకారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు కొంతలో కొంత ఊరట కలిగించేలా.. ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీకి కేంద్రం చట్టబద్దత కల్పించనుంది. ఈ మేరకు బుధవారం నాడు నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశాన్ని చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

AP Special package may get legality on tomorrow

కాగా, సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు కేంద్రమంత్రి సుజనాచౌదరి ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గత రెండు రోజులుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ అధికారులతో మంతనాలు జరుపుతున్న ఆయన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాల్సిందిగా వారికి విన్నవించారు.

సీఎం ఆదేశాల మేరకు ప్యాకేజీ చట్టబద్దతలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు సుజనాచౌదరి ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాకేజీతో పాటు పలు అంశాలను కూడా కేబినెట్ అజెండాలో చేర్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
It might be a chance that AP Special package may get legality on wednesday cabinet meet. For this central minister Sujana Chowdary is trying very seriously
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X