వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని రైల్లోనుండి భార్యను తోసేశాడు

ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతోందనే అనుమానంతో భార్యను భర్త రైల్లో నుండి బయటకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.ఈ ఘటన ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం కడవకుదురు సమీపంలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతోందనే అనుమానంతో భార్యను భర్త రైల్లో నుండి బయటకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.ఈ ఘటన ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం కడవకుదురు సమీపంలో చోటుచేసుకొంది.

తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైళ్లో వెళ్తోన్న అశుతోష్ అనే వ్యక్తి తన భార్య అల్పనాకుమారి తో గొడవపడ్డాడు. గత కొంతకాలంగా అల్పనాకుమారి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అశుతోష్ అనుమానిస్తున్నాడు.

దీంతో ఆశుతోష్ రైలు వేగంగా వెళ్తున్న సమయంలోనే ఆమెను కిందకు తోసేశాడు. దీంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో అల్పనాకుమారి అక్కడికక్కడే మరణించింది.

Asutosh threw his wife from running train in Prakasham district

భార్య, భర్తల మధ్య గొడవలో తాము ఎందుకు తలదూర్చాలని ఊరుకొన్న తోటి ప్రయాణీకులు విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా అనుమానంతో అశుతోష్ ఈ పనికి పాల్పడినట్టు ప్రయాణీకులు చెప్పారు.

విజయవాడ రైల్వే పోలీసులు నిందితుడు ఆశుతోష్ ను అదుపులోకి తీసుకొన్నారు.మృతదేహన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary
Asutosh threw his wife from running train in Prakasham district.he suspected on Alpana Kumari talking her lover on phone.Vijayawada police arrested Asutosh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X