కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రొద్దుటూరులో బిటెక్ విద్యార్థి హైందవిని గొంతుకోసి చంపారు

కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో ఉన్న బిటెక్ యువతి హైందవిని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. బాధితురాలు అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నార

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో ఉన్న బిటెక్ యువతి హైందవిని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. బాధితురాలు అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. అయితే నిందితులు స్థానికులను చూసి నిందితులు పారిపోయారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకొన్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. బిటెక్ విద్యార్థిని ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకొన్న నిందితులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు.

B.Tech student Haindavi murdered in Proddutoor

కత్తులతో హైందవిని గొంతుకోసి చంపారు. తల్లిదండ్రులు విధినిర్వహణ నిమిత్తం ఇంటి వద్ద లేరు.అయితే తండ్రి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌‌గా పనిచేస్తున్నాడు. అయితే హైందవి హైద్రాబాద్‌లో బిటెక్ పూర్తిచేసింది. అయితే శివారు ప్రాంతంలో ఇళ్లు ఉన్న కారణంగా ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని గుర్తించిన నిందితులు హైందవిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
B.Tech student Haindavi murdered by unknown persons on Friday evening in Proddatoor . Haindavi family members complaint to police.police searching for accused
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X