ప్రొద్దుటూరులో బిటెక్ విద్యార్థి హైందవిని గొంతుకోసి చంపారు
కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్నగర్లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో ఉన్న బిటెక్ యువతి హైందవిని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. బాధితురాలు అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నార
కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్నగర్లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో ఉన్న బిటెక్ యువతి హైందవిని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. బాధితురాలు అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. అయితే నిందితులు స్థానికులను చూసి నిందితులు పారిపోయారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకొన్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. బిటెక్ విద్యార్థిని ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకొన్న నిందితులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు.
కత్తులతో హైందవిని గొంతుకోసి చంపారు. తల్లిదండ్రులు విధినిర్వహణ నిమిత్తం ఇంటి వద్ద లేరు.అయితే తండ్రి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అయితే హైందవి హైద్రాబాద్లో బిటెక్ పూర్తిచేసింది. అయితే శివారు ప్రాంతంలో ఇళ్లు ఉన్న కారణంగా ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని గుర్తించిన నిందితులు హైందవిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.