నాకెంతో సంతోషం: చంద్రబాబు, కేసీఆర్లపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు.
దూసుకెళ్తున్నారు..
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నాయని అన్నారు. గురువారం జరిగిన బసవతారకం ఆస్పత్రి 17వ వార్షికోత్సవంలో బాలకృష్ణ మాట్లాడారు.
వారి సహకారం నాకెంతో సంతోషం
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహం, చేయూత ఇస్తుండటం ఆ సంస్థ ఛైర్మన్గా తనకెంతో సంతోషమని అన్నారు.
పోటీ పడుతున్నారు..
ఏపీ, తెలంగాణ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయని బాలకృష్ణ తెలిపారు.
ప్రశంసలు
తన తండ్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్తో సంబంధాలు కలిగిన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లు అభివృద్ధి పథంలో తెలుగు ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, ఏపీ స్పకర్ కోడెల శివప్రసాద్, సినీ నటి గౌతమి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.