జగన్ కారు: క్రిమినల్ కేసులని భన్వర్లాల్, లెజెండ్పైనా
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అలాగే బాలకృష్ట నటించిన లెజెండ్ సినిమాపై ఇంకా పరిశీలన జరుగుతుందన్నారు. మరోవైపు, మేనిఫెస్టోల్లో ఇచ్చిన ఉచిత హమీలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరణలను, ప్రాంతీయతత్త్వాన్ని రెచ్చగొట్టే విధంగా కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపినట్లు చెప్పారు.
సోమవారం తన కార్యాలయంలో బిఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశమైన ఆయన తరువాత విలేకర్లతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో 69,014 పోలింగ్ స్టేషన్లకుగాను 46వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను కోరినట్లు చెప్పారు.
ఓటర్ల నమోదు, ఫోటో గుర్తింపు కార్డుల జారీలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం పోలింగ్లోనూ మొదటి స్థానంలో ఉండేలా 90 శాతం పోలింగ్కు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యం, నగదు, బహుమతులు వంటి ప్రలోభాలను నిలువరించడానికి 2164 చెక్పోస్ట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నాయన్నారు. ఎక్కడైనా మద్యం, డబ్బు పంపిణీ చేస్తుంటే 8790499899కి ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీని 23వ తేదీ నుంచి సీమాంధ్రలో ప్రారంభించనున్నామని, తెలంగాణలో 25వ తేదీ నాటికి పంపిణీని పూర్తి చేస్తామని తెలిపారు.