కిశోర్ బాబు ఎఫెక్ట్: మంత్రి అయ్యన్నకు చేదు అనుభవం
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడికి గుంటూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆహ్వానం మేరకు అయ్యన్నపాత్రుడు పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడికి గుంటూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆహ్వానం మేరకు అయ్యన్నపాత్రుడు పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న కాన్వాయ్ను స్థానికులు అడ్డుకున్నారు. ఇంటి రుణాల మంజూరుకు కిషోర్ బాబు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ వ్యక్తులను కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని ఈ పరిణామంతో అయ్యన్నపాత్రుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు సాగింది.
Comments
English summary
Andhra Pradesh minister Ayyanna Patrudu faced Bitter experience in Prathipadu in Guntur district.
Story first published: Wednesday, June 28, 2017, 17:41 [IST]