జనసేనానికి అరుదైన అవకాశం: హార్వార్డ్ వర్సిటీలో ప్రసంగానికి ఆహ్వానం
అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ప్రసంగించే అవకాశం పవన్ కళ్యాణ్ కు దక్కింది. ఈ మేరకు బోస్టన్ వర్సిటీ అధికారులు ఆయనకు ఆహ్వానం పంపించారు.
విజయవాడ: అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడే అవకాశం రావడం గొప్ప విషయంగానే పరిగణిస్తాం. ముఖ్యంగా ప్రాంతీయ నాయకులు అంతర్జాతీయ వేదికల నుంచి మాట్లాడటం ద్వారా తమ ప్రాపంచిక దృక్పథాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడలాంటి అరుదైన అవకాశం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను వరించింది.
అమెరికా బోస్టన్ లోని హార్వార్డ్ యూనివర్సిటీలో ప్రసంగించే అవకాశం పవన్ కళ్యాణ్ కు దక్కింది. ఈ మేరకు బోస్టన్ వర్సిటీ అధికారులు ఆయనకు ఆహ్వానం పంపించారు. ఫిబ్రవరి 11నుంచి రెండు రోజుల పాటు జరగబోయే 'ఇండియా కాన్ఫరెన్స్ 2017'లో ప్రసంగాంచిల్సిందిగా పవన్ కు ఆహ్వానం పంపించారు.
పవన్ కల్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్కు కూడా బోస్టన్ వర్శిటీ అధికారుల నుంచి ఆహ్వానం అందింది. దీంతో వీరిద్దరు కలిసి కాన్ఫరెన్స్ కు హాజరవనున్నారు. ఇదిలా ఉంటే, పవన్ కు లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం పవన్ 'కాటమరాయుడు' సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు.