కాంగ్రెస్కు షాక్, తిట్టిన జగన్ వైపు: వైసీపీలోకి బొత్స, కండిషన్?
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సొంత పార్టీకి షాకివ్వనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, జ్యోతుల నెహ్రూ, మిథున్ రెడ్డి తదితరులు బొత్స నివాసానికి వెళ్లి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వారి చర్చల్లో వైసీపీలో చేరేందుకు బొత్స సానుకూలంగా స్పందించారనే టీవీలలో వస్తోంది. తిట్టిన నోటనే, విశాఖ బాధ్యతను తనకు అప్పగించాలని బొత్స కండిషన్ పెట్టినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో మంగళగిరిలో చేయనున్న దీక్షలోను బొత్స పాల్గొనవచ్చునని అంటున్నారు. కాగా, జగన్ సొంత కుంపటి పెట్టాక ఆయనను తీవ్రస్థాయిలో విమర్శించిన వారిలో బొత్స కూడా ఉండటం గమనార్హం. అయితే, దీనిపై ఆయన స్పందించవలసి ఉంది.