పవన్ కళ్యాణ్కు బొత్స కౌంటర్: హోదాపై ఎంత సమయం కావాలో పవన్ చెప్పాలి
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా వస్తే ఒక్కో పట్టణం హైదరాబాద్ లా తయారవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేకహోదాతోనే పరిశ్రమలకు మనుగడ, యువతకు ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత యువత ఉద్యోగావకాశాలు కోల్పోయామన్నారు.
ప్రత్యేకహోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వస్తే అది పెద్దల పంపకానికే సరిపోతుందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్ధత వల్లే ప్రత్యేక హోదా రావట్లేదని, బంద్ను విఫలం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హోదా సంజీవిని కాదంటున్న నేతలు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఇంకొంత కాలం వేచిచూద్దామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలపై బొత్స స్పందిస్తూ, హోదాపై ఎంత సమయం కావాలో పవనే చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.