రాజధానికి 'తొమ్మిది' సెంటిమెంట్: 'amaravati'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన అమరావతి పేరును ఆంగ్లంలో తొమ్మిది అక్షరాలతో amaravati ప్రభుత్వం పేర్కొంది. రాజధానికి అన్ని రకాలుగా మంచి జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిది అక్షరాలతో ఉండేలా దీనిని రాస్తోంది.
తొమ్మిది అక్షరాలతో కూడిన పేరునే ఏప్రిల్ 23న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సాధారణంగా తెలుగులో మాట్లాడే విధానం ప్రకారం అమరావతి పేరును ఇంగ్లీషులో amaravathiగా రాస్తారు. ఇందులో పది అక్షరాలు ఉన్నాయి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిదిని అత్యుత్తమ సంఖ్యగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం amaravathiకి బదులు తొమ్మిది అక్షరాలతో కూడిన amaravatiని పేర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది.
కాగా, కొత్త రాజధాని అమరావతి వాస్తు బాగుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సింగపూర్కు కూడా వాస్తు విశ్వాసాలు ఉన్నాయా అనే చర్చ ప్రారంభమైంది. టీవీ చానెళ్లలో మంగళవారం ఉదయం దానిపైనే చర్చ సాగింది. రాజధాని అమరావతి వాస్తు బాగుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు.