ఉపాధికోసం భర్త గల్ప్ కు, కానిస్టేబుల్ తో భార్య ప్రేమాయణం, భర్త ఏం చేశాడంటే?
ఉపాధికోసం భర్త గల్ప్ కు వెళ్తే , కానిస్టేబుల్ తో భార్య ప్రేమాయణం సాగిస్తోంది. గల్ప్ నుండి ఇంటికి వచ్చిన భర్తను భార్య లెక్కచేయడం లేదు. కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహరాన్ని వదులుకోవాలని సూచించినా పట్టిపట్ట
కడప: ఉపాధికోసం భర్త గల్ప్ కు వెళ్తే , కానిస్టేబుల్ తో భార్య ప్రేమాయణం సాగిస్తోంది. గల్ప్ నుండి ఇంటికి వచ్చిన భర్తను భార్య లెక్కచేయడం లేదు. కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహరాన్ని వదులుకోవాలని సూచించినా పట్టిపట్టన్టు వ్యవహరించింది.ఈ విషయమై బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కడప జిల్లాలోని కానిస్టేబుల్ ప్రేమాయణం ఇది.
కడప జిల్లాలోని చిన్నమండెం మండలం కేశాపురం దేవలంపేటకు చెందిన హసనాపురం రామాంజులుకు భార్య సుజాత, రెండేళ్ళ కుమార్తై ఉంది. అయితే కులవృత్తి చేసుకొని జీవనం సాగించేవాడు రామాంజులు.అయితే కరువు కారణంగా ఉపాధిలేకపోవడంతో రామాంజులు గల్ప్ కు వెళ్ళాడు.
గల్ప్ కు వెళ్ళి రెండేళ్ళకు ఓసారి రామాంజులు స్వంత ఇంటికి తిరిగివచ్చేవాడు. అయితే తొలుత రెండేళ్ళపాటు ఆయన భార్య బాగానే ఉంది. అయితే రెండేళ్ళ తర్వాత గల్ప్ కు వెళ్ళాడు రామాంజులు. అయితే అదే సమయంలో రామాంజులు సతీమణి సుజాతకు చిన్నమండెం స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రామాంజినేయులుతో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం ప్రేమగా మారింది. రామాంజులు ఐదేళ్ళక్రితం గల్ప్ కు వెళ్ళాడు. అయితే మూడు మాసాల క్రితం గల్ప్ నుండి రామాంజులు కడపకు తిరిగివచ్చాడు. అయితే సుజాతతో కానిస్టేబుల్ రామాంజనేయులు ప్రేమాయణం వ్యవహారాన్ని స్థానికులు రామాంజులుకు చెప్పారు. ఈ విషయమై ఆయన భార్య సుజాతను నిలదీశాడు.
అయితే ఈ విషయమై భార్య సుజాత లెక్కచేయలేదు. పైగా భర్తకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది.ఈ విషయమై కానిస్టేబుల్ రామాంజనేయులును కూడ రామాంజులు మందలించాడు. అయితే రామాంజనేయులు కూడ లెక్కచేయలేదు. పైగా బాధితుడిని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో రామాంజులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో అతను రెచ్చిపోయాడు . తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశాడు.దీంతో బాధితుడు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. వారి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ రామాంజినేయులుపై కేసు నమోదు చేశారు.