బాబుకే సారథ్యం.. పెద్ద నోట్ల రద్దుపై ఆరు రాష్ట్రాల సీఎంలతో సబ్ కమిటీ..
పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆరు రాష్ట్రాల సీఎంలతో కూడిన ఓ సబ్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కేంద్రం ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం సాయంత్రం చంద్రబాబుకు విషయాన్ని ముందుగానే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొత్తం ఆరు రాష్ట్రాల సీఎంలతో కూడిన సబ్ కమిటీని మంగళవారం నాడు కేంద్రం ఏర్పాటు చేసింది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పుదుచ్చేరి సీఎం నారాయణ, త్రిపుర మాణిక్ సర్కార్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లను కమిటీలో సభ్యులుగా నియమించింది కేంద్రం. ఈ ఆరుగురు సభ్యుల కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తారు. నోట్ల రద్దు నేపథ్యంలో.. నగదు రహిత లావాదేవీలే ప్రధాన అజెండాగా కేంద్రం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
Glad to have received Centre's call to head the Committee of CMs to look into the issues following #demonetisation. pic.twitter.com/6CgAVLdg18
— N Chandrababu Naidu (@ncbn) November 29, 2016
నగదు రహిత లావాదేవీలతో పాటు కార్డుల వినియోగానికి సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సబ్ కమిటీ కేంద్రానికి నివేదిక అందించనుంది. కాగా, వచ్చే నెల 2న సబ్ కమిటీ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది.