బాబు, కేసీఆర్లకు మోడీ ఊరట: ఢిల్లీ ఇచ్చిన విద్యుత్ టీ, ఏపీలకు
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉరటను ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు భారీ విద్యుత్ కోతతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలకు అదనపు విద్యుత్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.
తెలంగాణకు 222, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 304, కేరళకు 167 మెగావాట్ల అదనపు విద్యుత్ను కేటాయించింది. ఢిల్లీ వెనక్కి ఇచ్చిన విద్యుత్ను కేంద్రం ఈ మూడు రాష్ట్రాలకు ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ కేటాయింపులు ఉంటాయి.
అక్టోబర్ 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన విద్యుత్ కూడా తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కేటాయిస్తారు. మొత్తం 693 మెగావాట్ల విద్యుత్ను ఈ మూడు రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే.