బియాస్ బాధితులకు చెక్కులందించిన చంద్రబాబు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగువారికి ఏ కష్టమొచ్చినా స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్లోని విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ హిమాచల్ప్రదేశ్కు విహారయాత్రకు వెళ్లి.. అక్కడి బియాస్ నదిలో ప్రమాదవశాత్తు మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఏపి సిఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించారు.
బియాస్ నది ప్రమాదంలో 25మంది ప్రాణాలు పోగొట్టుకోగా.. వారిలో ఒకరి తల్లిదండ్రులకు గతంలోనే రూ. 5లక్షలు సాయం అందించారు. కాగా, మరో 24మంది విద్యార్థుల తల్లిదండ్రులకు రూ. 5లక్షల చొప్పున మంగళవారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద ఘటనపై తనకు చేతనైన సాయం చేశానని చెప్పారు.
‘పిల్లల్ని పోగొట్టుకున్న మీ బాధ తీర్చలేం. ఇప్పటికీ మీలో ఎంత బాధ ఉందో చూస్తున్నాం. విధిని మార్చలేం. కానీ నాకు చేతనైనంత మేర స్పందించాను' అని చంద్రబాబు అన్నారు. ఏపిలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. విహార, విజ్ఞాన యాత్రలు నిర్వహించే కళాశాలలు, పాఠశాలలు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో విధి విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు
తెలుగువారికి ఏ కష్టమొచ్చినా స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
చంద్రబాబు
హైదరాబాద్లోని విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ హిమాచల్ప్రదేశ్కు విహారయాత్రకు వెళ్లి.. అక్కడి బియాస్ నదిలో ప్రమాదవశాత్తు మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఏపి సిఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించారు.
చంద్రబాబు
బియాస్ నది ప్రమాదంలో 25మంది ప్రాణాలు పోగొట్టుకోగా.. వారిలో ఒకరి తల్లిదండ్రులకు గతంలోనే రూ. 5లక్షలు సాయం అందించారు.
చంద్రబాబు
కాగా, మరో 24మంది విద్యార్థుల తల్లిదండ్రులకు రూ. 5లక్షల చొప్పున మంగళవారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు చెక్కులను అందించారు.
చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద ఘటనపై తనకు చేతనైన సాయం చేశానని చెప్పారు.
చంద్రబాబు
‘పిల్లల్ని పోగొట్టుకున్న మీ బాధ తీర్చలేం. ఇప్పటికీ మీలో ఎంత బాధ ఉందో చూస్తున్నాం. విధిని మార్చలేం. కానీ నాకు చేతనైనంత మేర స్పందించాను' అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
ఏపిలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
చంద్రబాబు
విహార, విజ్ఞాన యాత్రలు నిర్వహించే కళాశాలలు, పాఠశాలలు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో విధి విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు.