వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ అభ్యర్థికి చంద్రబాబు రూ. 10 కోట్లు: భూమన

చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థికి రూ.10 కోట్లు ఇచ్చారని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: కుట్రలు చేసేందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ ఒక్కటౌతున్నాయని వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకుగాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చంద్రబాబునాయుడు రూ. 10 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. గతంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని జైలుకు పంపేందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్, టిడిపి దొంగనాటకాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

Chandrababu gives Rs. 10 crores to Congress candidate

కాంగ్రెస్‌కు వేసే ఓటు డ్రైనేజీలో వేసినట్టేనని భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.రైతులు. డ్వాక్రా మహిళలు, ముస్లింలు కాపులు, దళితులు, విద్యార్థులు సహ అందరిని చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు.లోకేష్‌ను దేశంలోనే అత్యంత సంపన్నుడిగా చేసేందుకుగాను చంద్రబాబు భూబకాసురుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వైసీపీ బిజెపితో చేతులు కలుపుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.బిజెపి జెండా కన్పించకుండా ఆ పార్టీతో అంటకాగుతోంది చంద్రబాబునాయుడు మాత్రమేనని చెప్పారు.నంద్యాలలో ప్రజలు టిడిపికి గుణపాఠం చెబుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

English summary
Ap Chief minister Chandrababu naidu given Rs. 10 crores to Congress candidate said Ysrcp general secretary Bhumana karunakar reddy in Nandyal on Monday.Ysrcp candidate Shilpa Mohan reddy will win in Nandyal by poll he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X