"చంద్రబాబుకు మతి భ్రమించింది.. వెంటనే పిచ్చాసుపత్రికి తరలించాలి"
చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారపూరితమని, ఒకరకంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడమేనని వెన్నపూస మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు బెదిరింపు ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు.
అనంతపురం: నంద్యాల పార్టీ మీటింగ్లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పాలన నచ్చకపోతే పెన్షన్ తీసుకోవద్దు.. తానేసిన రోడ్లపై నడవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించగా.. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి స్పందించారు.
నా పాలన నచ్చకపోతే పెన్షన్లు తీసుకోవద్దు, రోడ్లపై నడవద్దు: బాబు షాకింగ్ కామెంట్స్
చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని గోపాల్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. టీడీపీకి ఓట్లేయకపోతే రేషన్ కట్ చేస్తామని చెప్పడం దుర్మార్గమైన వ్యవహారమన్నారు. సీఎం పదవిలో ఉంటూ చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని వెన్నపూస ఫైర్ అయ్యారు. నంద్యాల ఉపఎన్నిక ఓటమి భయంతోనే చంద్రబాబును అభద్రతా భావం వెంటాడుతుందన్నారు.
చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు, ఆ ట్వీట్ మాజీ ప్రధానిదేనా?
చంద్రబాబు వ్యాఖ్యలు అహంకారపూరితమని, ఒకరకంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడమేనని వెన్నపూస మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు బెదిరింపు ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. పెన్షన్లు, రోడ్ల కోసం ఖర్చు పెట్టేది సీఎం చంద్రబాబు సొంత డబ్బు కాదని, అది ప్రజల డబ్బన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం తానే అన్న సంగతి మరిచి.. చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.