వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాదీ తయారీ, బాబు సైకిల్ రైడ్
విజయవాడ: హైదరాబాద్ కుర్రాడు సృజనాత్మకంగా ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశారు. ఆ ప్రత్యేక సైకిల్ను ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. హైదరాబాద్కు చెందిన గయమ రాజ అనే యువకుడు ఈ ఎలక్ట్రికల్ సైకిల్ను రూపొందించారు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ఎలక్ట్రికల్ సైకిల్ గంటకు25 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. రాజ తయారుచేసిన ఈ సైకిల్ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీనిపై చంద్రబాబు సరదాగా షికారు చేశారు. సైకిల్ రూపొందించిన రాజా ను చంద్రబాబు అభినందించారు.
Comments
English summary
Chandrababu Naidu Midnight Cycle Ride in Amaravati.
Story first published: Monday, October 24, 2016, 16:08 [IST]