హుధుద్: బాబు కేబినెట్ నివాళి, విరాళాలు(పిక్చర్స్)
హైదరాబాద్: అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం గురువారమిక్కడ సచివాలయంలో జరిగింది. హుధుద్ తుఫాను సాయం మొదలు బదిలీల్లో అవినీతి వరకు వరకు పలు అంశాలు ఇందులో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో హుధుద్ తుఫాను మృతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సంతాపం తెలిపారు.
ఉద్యోగులకు హెల్త్ కార్డులు
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఉద్యోగులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే ప్రభుత్వం, ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటిని దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.
కేబినెట్ సమావేశం
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
విరాళాలు
హాత్వే తరపున రాజశేఖర్ రూ. 30లక్షల చెక్కును సిఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తున్న దృశ్యం.
విరాళాలు
చిత్తూరు జిల్లా బంగారుపాళెం నియోజకవర్గం ప్రజలు రూ. 10.31లక్షలను చంద్రబాబుకు అందిస్తున్న దృశ్యం.
విరాళాలు
సిఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 71,111ల చెక్కును సిఎం చంద్రబాబుకు అందిస్తున్న కస్తూరి రమేష్.
కేబినెట్ సంతాపం
ఏపి కేబినెట్ సమావేశంలో హుధుద్ తుఫాను మృతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సంతాపం తెలిపారు.
విరాళాలు
ఏపి సర్పంచులు, ఎంపిటీసీలు, జడ్పీటీసీలు రూ. 2.33 కోట్లను సిఎంఆర్ఎఫ్కు అందిస్తున్న దృశ్యం.
విరాళాలు
ఎం, డబ్ల్యూ గ్రూప్ సిఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10లక్షలను అందిస్తున్న దృశ్యం.
విరాళాలు
హుధుద్ బాధితుల కోసం రూ. 21,03, 647లను సిఎంకు అందిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
విరాళాలు
ఏపి స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ సిఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 2కోట్లను అందిస్తున్న దృశ్యం.
విరాళాలు
రూ. 3,37,291లను సిఎం రిలీఫ్ ఫండ్ కోసం అందిస్తున్న విఎంకె సాఫ్ట్వేర్ సొల్యూషన్స్.
విరాళాలు
రూ. 76,66,062లను సిఎం రిలీఫ్ ఫండ్ కోసం అందిస్తున్న ఏపి టొబాకో బోర్డు గుంటూరు.
విరాళాలు
పి. వేణుగోపాల్ రెడ్డి రూ. 5లక్షలను సిఎంఆర్ఎఫ్కు అందజేస్తున్న దృశ్యం.
చంద్రబాబు
సచివాలయం వద్ద సిఎం చంద్రబాబుకు తన సమస్యను తెలుపుకుంటున్న ఓ మహిళ.
చంద్రబాబు
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఉద్యోగులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే ప్రభుత్వం, ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు.
చంద్రబాబు
గురువారం సాయంత్రం రవీంద్ర భారతిలో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్కార్డుల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
విరాళాలు
కృష్ణా జిల్లాలోని కంచికచర్ల సాయి సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రూ. 3లక్షలను సిఎంఆర్ఎఫ్కు అందిస్తున్న దృశ్యం.
గురువారం సాయంత్రం రవీంద్ర భారతిలో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్కార్డుల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఎపి ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ సిఇవో ధనుంజయ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తొలి హెల్త్కార్డును భోగరాజు అనే ఉద్యోగికి అందించి పథకాన్ని ప్రారంభించారు.
నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న హెల్త్ కార్డుల పథకం ద్వారా 3.91 లక్షల మంది ఉద్యోగులు, 3.58 లక్షల మంది పెన్షనర్లతో కలిపి మొత్తం 22 లక్షల మంది లబ్ధి పొందుతారని చంద్రబాబు తెలిపారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత, హుదూద్ తుపాను సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించిన తీరు అభినందనీయమని ఆయన కొనియాడారు.