ఏక్తాదివస్: ప్రతిజ్ఞ చేయించిన బాబు, విరాళం(పిక్చర్స్)
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు అంతా పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పటేల్ జయంతిని శుక్రవారం సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సచివాలయ ఉద్యోగులతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. పటేల్ దేశ సమైక్యతకు కృషి చేశారని బాబు కొనయాడారు.
దేశంలోని 600 సంస్థానాలను విలీనం చేస్తూ నిరంకుశ పాలనను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ కూడా ఆ సంస్థానాల్లో ఒక భాగమని చెప్పారు. పటేల్ ఆశయ సాధనకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. ఉక్కు మనిషి జీవితం నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగుంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, దేశంలోని వనరులను క్రమపద్ధతిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పేదరికంపై గెలుపుతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చంద్రబాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలాలను పేదలకు అందించే బాధ్యతను ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు
ధర్మవరం ఎమ్మెల్యే జి. సూర్యనారాయణ, సభ్యులు రూ. 36లక్షల చెక్కును చంద్రబాబుకు అందిస్తున్న దృశ్యం.
చంద్రబాబు
కడప మెప్మా డ్వాక్రా గ్రూప్ సభ్యులు, సిబ్బంది రూ. 9.24 లక్షలను చంద్రబాబుకు అందిస్తున్న దృశ్యం.
చంద్రబాబు
హైదరాబాద్ ఎస్బిఐ పెన్షనర్స్ అసోసియేషన్ రూ. 3లక్షలను సిఎం చంద్రబాబుకు అందిస్తున్న దృశ్యం.
ఏక్తా దివాస్
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు అంతా పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏక్తా దివాస్
పటేల్ జయంతిని శుక్రవారం సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సచివాలయ ఉద్యోగులతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
విరాళాలు
రూ. 2.5లక్షల చెక్కును బాబుకు అందిస్తున్న గుంటూరు జిల్లాలోని పెదకూరుపాడు కాకతీయ గ్రూప్ స్కూల్స్ యాజమాన్యం.
చంద్రబాబు
ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగుంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, దేశంలోని వనరులను క్రమపద్ధతిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చంద్రబాబు
పేదరికంపై గెలుపుతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు
రూ. 25వేలను సిఎం చంద్రబాబుకు అందిస్తున్న కొండాపూర్ బచపన్ స్కూల్ సిబ్బంది, విద్యార్థులు
చంద్రబాబు
గుంటూరు జిల్లా పెదకోరపాడు టిడిపి నాయకులు రూ. 20లక్షల చెక్కును సిఎంకు అందిస్తున్న దృశ్యం.