ట్రాఫిక్లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్, దారితప్పిన ఎస్కార్ట్ వాహనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్కార్ట్ వాహనం దారి తప్పింది. ఆదివారం నాడు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్తుండగా చంద్రబాబు ఎస్కార్క్ వాహనం ఒకటి దారి తప్పింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు సమాచారం అందించారు. దీంతో దారిమళ్లిన వాహనాన్ని వెనక్కి రప్పించారు. ట్రాఫిక్ స్తంభించటంతో తిరుచానూరు వంతెన వద్ద కొద్దిసేపు చంద్రబాబు కాన్వాయ్ నిలిచింది. కాగా, తిరుపతి మహాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఓడీఎఫ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
మహాత్మా గాంధీకి నివాళులు
ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం తిరుపతి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఏరికోరి దూరం: రూటుమార్చి పవన్ కళ్యాణ్కు షాకిచ్చిన చంద్రబాబుభారత దేశానికి దశ, దిశ చూపిన నేత మహాత్మా గాంధీ అని పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. గాంధీ చూపిన ఆదర్శాలే కాంగ్రెస్కు శాసనం అన్నారు. క్లిష్ట సమయాల్లో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమే కానీ పాకిస్తాన్కు కాదని చెప్పారు. పాక్ ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టాలన్నారు.