అద్దె ఇంట్లోకి మారిన చంద్రబాబు ఫ్యామిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుటుంబం హైదరాబాదులోని అద్దె ఇంట్లోకి మారింది. శనివారం ఉదయం హైదరాబాదులోని జూబ్లీహిల్స్లోని ఓ అద్దె ఇంటికి ఆయన కుటుంబం మారింది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 65లో ఉన్న ఇఁటి స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నారు. ఆ కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 24లో గల అద్దె ఇంట్లో ఉంటారు.
చంద్రబాబు కుటుంబం అద్దె ఇంట్లోకి మారనున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. నిజానికి, ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు అద్దె ఇంట్లోకి మారాల్సి ఉంది. కానీ, ఎందువల్లనో జాప్యం జరిగింది.
కాగా, నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే తాత అయ్యారు. కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి దంపతులు పడ్డంటి కుమారుడికి జన్మనిచ్చారు. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదుగురు అయ్యారు.