వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడకు చార్మీ దెబ్బ?: బర్నింగ్ ఇష్యూ ముందు ఆ ఇష్యూ 'సైడ్' అయింది!

ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4.30గం. వరకు మీడియా కథనాలన్నీ ఛార్మీ చుట్టే తిరిగాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బర్నింగ్ ఇష్యూల వెంట పరిగెత్తడం మీడియాకు కామన్. టీఆర్పీలు రావాలంటే వివాదాల్లోకి కెమెరాలు దూర్చాల్సిందే. విషయం గ్లామర్ ఫీల్డ్‌కు సంబంధించిందైతే.. నిమిషానికొక బ్రేకింగ్ లెక్కన వీక్షకుల్ని టీవిలకు కట్టిపడేయాల్సిందే.

ఈ బ్రేకింగ్ న్యూస్‌ను బ్రేక్ చేసుకుని మరో వార్త మీడియాలో హైలైట్ అవాలంటే.. అంతకుమించిన హైడ్రామా ఏదో రక్తి కట్టాలి. ఇంతా జరిగినా.. గ్లామర్ ఫీల్డ్ ఇష్యూలో అవతలి ఇష్యూస్ కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. బుధవారం రోజు మీడియా తెర మీద చార్మి చుట్టూ రక్తి కట్టిన ఇష్యూలో.. ముద్రగడ పాదయాత్రకు ఫోకసే కరువైంది.

charmy effect on mudragada padmanabham padayatra

ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4.30గం. వరకు మీడియా కథనాలన్నీ ఛార్మీ చుట్టే తిరిగాయి. దీంతో ముద్రగడ పాదయాత్ర ఇష్యూకు రావాల్సినంత ఫోకస్ రాలేదు. ప్రతీ బులెటిన్ లో ఏదో 20-30సెకన్ల వార్తతో ముద్రగడ పాదయాత్రను మమా అనిపించింది మీడియా. వందల మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ మోహరించినా.. డ్రగ్స్ కేసు ముందు మీడియాకు అది హైలైట్‌గా కనిపించలేదు.

మీడియా ఫోకస్ మిస్సవడంతో ముద్రగడ ప్లాన్ విఫలమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో ఇటు జనంలోను పాదయాత్రకు సంబంధించి పెద్దగా చర్చ కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయన పాదయాత్రకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఛార్మీ విచారణ ఎఫెక్ట్ ముద్రగడ పాదయాత్ర మీద ఇలా ప్రభావం చూపించిందన్నమాట.

English summary
On Wednesday entire telugu media was revolved around Heroine Charmy Kaur interrogation infront SIT, though this Mudragada Padmanabham Padayatra was not highlighted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X