శ్రీవారి సేవలో హైకోర్టు సిజె కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా(పిక్చర్స్)
తిరుపతి: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆదివారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వాముల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ వేదపండితులు మొదట ఆయనకు ఆలయ ద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన డివి రమణ దీక్షితులు స్వామివారి గురించిన విశేషాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు వివరించారు. రంగనాయకులు మండపంలో ఆలయ వేదపండితులు ప్రధాన న్యాయమూర్తికి వేదాశీర్వాదం అందించారు.
కాగా, సోమవారం ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 12గంటలు, కాలినడక భక్తుల దర్శనానికి 8గంటలు, ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.
తిరుమల
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆదివారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వాముల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తిరుమల
ఆలయ వేదపండితులు మొదట ఆయనకు ఆలయ ద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
తిరుమల
ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన డివి రమణ దీక్షితులు స్వామివారి గురించిన విశేషాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు వివరించారు.
తిరుమల
రంగనాయకులు మండపంలో ఆలయ వేదపండితులు ప్రధాన న్యాయమూర్తికి వేదాశీర్వాదం అందించారు.