హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాడైపోయిన గుడ్లు తిని విద్యార్ధులకు అస్వస్ధత, విష జ్వరాలతో ముగ్గురి మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని సూగూరు ప్రాధమిక పాఠశాలలో పడైపోయిన గుడ్లు తిని ఎనిమిది మంది విద్యార్ధులు అస్వస్ధతకు గురయ్యారు. మధ్యాహ్నా భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు తిన్న విద్యార్ధులకు వాంతలయ్యాయి. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.

children's eat eggs in hindupuram it causes un healthy

గొడిచర్ల వద్ద ఢీ కొన్న లారీలు

విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లి మండలం గొడిచర్ల గ్రామం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విష జ్వరాలతో ముగ్గురి మృతి

విషజ్వరాల బారినపడి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో గురువారం ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరాలతో బాధపడుతూ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న నగుళ్ళ లక్ష్మి(52), జుజ్జవరపు వెంకటేశ్వరరావు(42), నవదాసరి గోపమ్మ(75) గురువారం మృతి చెందారు. మరో 10 మంది గ్రామస్తులు కూడా విషజ్వరాల బారినపడి చికిత్స పొందుతున్నారు.

English summary
Children's eat eggs in hindupuram it causes unhealthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X