బాబుతో చైనా, సింగపూర్ డెలిగేట్స్ భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సువర్ణావకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. మౌలిక సదుపాయాలు, నౌకాశ్రయాలు, నిర్మాణం, తయారీ, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, వీటిని చైనా పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
గురువారం చైనా పారిశ్రామిక ప్రతినిధుల బృందం చంద్రబాబును కలిసిన సమయంలో ఈ మేరకు వివరించారు. చంద్రబాబు ఇటీవల చైనాకు వెళ్లినప్పుడు ఆహ్వానించిన నేపథ్యంలో సిచువాన్ రాజధాని చెంగ్దు ఉపమేయర్ యాంగ్లిన్ ఆధ్వర్యంలోని ఓ వాణిజ్య ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్ వచ్చి చంద్రబాబును కలిసింది.
చంద్రబాబు
ఏపి సిఎం చంద్రబాబును సచివాలయంలో కలిసిన సింగపూర్ ప్రతినిధి గోపినాథ్ పిళ్లై.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సువర్ణావకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలకు తెలిపారు.
చంద్రబాబు
మౌలిక సదుపాయాలు, నౌకాశ్రయాలు, నిర్మాణం, తయారీ, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, వీటిని చైనా పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
చంద్రబాబు
గురువారం చైనా పారిశ్రామిక ప్రతినిధుల బృందం చంద్రబాబును కలిసిన సమయంలో ఈ మేరకు వివరించారు.
ఈ సందర్భంగా ఏపిలోని వ్యాపార అవకాశాలపై సిఎంతో చర్చించింది. చెంగ్దు ప్రతినిధి బృంద నేత యాంగ్లిన్ మాట్లాడుతూ.. చెంగ్దు నగర పారిశ్రామికవేత్తలు ఇక్కడ సాఫ్ట్వేర్ సర్వీసులు, తయారీ రంగంపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం కూడా సిఎం చంద్రబాబును కలిసింది. ఏపి అభివృద్ధికి సహకరిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం తెలిపింది. సిఎం చంద్రబాబుతో సమావేశమైన ఆస్ట్రేలియా కౌన్సెలర్ సీన్ కెల్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. ఏపిలో క్రీడా, జలవనరుల విశ్వవిద్యాలయాలు నెలకొల్పితే సహకరిస్తామని హామీ ఇచ్చారు.