వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరియల్ ఎఫెక్ట్, చిన్నారి పెళ్లి కూతురు: తల్లిపై కోపంతో పక్కింటి వ్యక్తిని పెళ్లాడిన బాలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో షాకింగ్. ఓ చిన్నారి పెళ్లి కూతురు అయింది. టీవీ సీరియల్ ప్రభావంతో, తల్లిదండ్రుల పైన కోపంతో 12 ఏళ్ల చిన్నారి పక్కింట్లో ఉండే 24 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది.

విశాఖ జిల్లాలో లక్ష్మీ, అప్పారావులు కూలీ పని చేసి బతుకుతున్నారు. వారికి నలుగురు అమ్మాయిలు. చివరి కూతురు చదువు పైన ఆసక్తి చూపించకపోయేది. దీంతో, తల్లి ఆమెను మందలించేది.

 Chinnari Pellikuthuru in Vishaka district

ఓ వైపు తల్లిదండ్రులు కోప్పడటం, మరోవైపు సీరియల్ ప్రభావంతో ఆ బాలిక పక్కింట్లో ఉండే బంగారు అప్పన్న అనే యువకుడిని పెళ్లాడింది. తల్లి కోప్పడుతుండటంతో అప్పన్న ఆమెను ఓదార్చుతుండేవాడు. దీంతో, వారి మధ్య స్నేహం, ఆ తర్వాత ప్రేమ ఏర్పడింది.

ఆమెను యలమంచిలి సమీపంలోని ఓ గుడిలో అప్పన్న పెళ్లి చేసుకున్నాడు. సోమవారం ఆమె మెడలో తాళితో పాఠశాలకు వచ్చింది. విద్యార్థులు ఆరా తీయడంతో ఆమె విషయం చెప్పింది. ఈ విషయాన్ని వారు హెడ్మాస్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు.

ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి పెద్దలుగా వ్యవహరించిన ముగ్గురు విద్యార్థులను మందలించారు. కాగా, పెళ్లైన తర్వాత విజయవాడ పారిపోదామనుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక తాను అత్తింట్లో ఉండి చదువుకుంటానని చెబుతోంది.

English summary
Chinnari Pellikuthuru in Vishaka district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X