నాడు వెలివేశారు,నేడు అక్కున చేర్చుకొన్నారు, ఐఎఎస్ 3వ,ర్యాంకర్ గోపాలకృష్ణ కుటుంబానికి ఘన స్వాగతం
ఒకనాడు ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్తులే , నేడు ఆ కుటుంబాన్నే గ్రామస్థులు సాదరంగా స్వాగతం పలికారు. ఐఎఎస్ లో మూడవ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణకు ఆయన స్వగ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్థులు.
శ్రీకాకుళం: ఒకనాడు ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్తులే , నేడు ఆ కుటుంబాన్నే గ్రామస్థులు సాదరంగా స్వాగతం పలికారు. ఐఎఎస్ లో మూడవ ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణకు ఆయన స్వగ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు గ్రామస్థులు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గర పురపాలక సంఘం పరిధిలోని పొరసాంబ అనే గ్రామంలో శనివారం పండగ వాతావరణం కన్పించింది.20 ఏళ్ళ క్రితం ఆ కుటుంబాన్ని వెలివేసిన గ్రామస్థులే శనివారం నాడు ఘనంగా ఆ కుటుంబానికి స్వాగతం పలికారు.
తమవాడు ఇంతగా ఎదగడంతో చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. పూలమాలలతో సత్కరించారు. 20 ఏళ్ళ క్రితం ఈ కుటుంబాన్ని వెలేసిన గ్రామస్థులే నేడు భాజాభజంత్రీలతో స్వాగతం పలికారు.
తమవాడు ఇంతగా ఎదగడంతో చూడటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామానికి చేరుకొన్న గోపాలకృష్ణ తల్లిదండ్రులను, తోబుట్టువులను బంధువులను ఒక్కసారిగా చూసిన జనం బోవోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులకు ఆయన పాదాబివందనం చేశారు.
ట్విస్ట్: సివిల్స్ 167 సివిల్స్ ర్యాంకర్ బాలలత శిష్యుడే గోపాలకృష్ణ, ఉద్యోగం చేయను
తాము పడిన కష్టాలను తమ కొడుకు శ్రమను గుర్తుచేసుకొని ఆనందబాష్పాలు రాల్చారు.బిడ్డను మనసారా ఎత్తుకొని నుదుట ముద్దాడారు. గోపాలకృష్ణకు మిఠాయి తినిపించారు.