హార్డ్వేర్ హబ్: సెల్కాన్ యూనిట్కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు(పిక్చర్స్)
చిత్తూరు: ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉంది. దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. 2020 నాటికి ఆయిల్ కంటే సెల్ఫోన్ల దిగుమతి పెరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీని హార్డ్వేర్ హబ్గా తయారు చేస్తాం' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
తిరుపతి విమానాశ్రయ సమీపంలో ‘సెల్కాన్' మొబైల్ కంపెనీకి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో నాలుగు సెల్ఫోన్ కంపెనీల హబ్ రావడానికి సెల్కాన్ ఎండీ గురుస్వామి నాయుడు కష్టపడ్డారన్నారు. ప్రభుత్వం తరఫున ఆయన్ను అంబాసిడర్గా ఉండాలని సీఎం కోరారు.
దేశంలోనే ఏపీ నెంబర్వన్ హార్డ్వేర్ హబ్గా తయారవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. రేణిగుంట సమీపంలో నాలుగు మొబైల్ తయారీ కంపెనీలు రావడం వల్ల ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
2022 నాటికి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో తిరుగులేని అభివృద్ధిని తీసుకువచ్చి అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తామన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.
చంద్రబాబు
‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉంది. దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. 2020 నాటికి ఆయిల్ కంటే సెల్ఫోన్ల దిగుమతి పెరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీని హార్డ్వేర్ హబ్గా తయారు చేస్తాం' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
చంద్రబాబు
తిరుపతి విమానాశ్రయ సమీపంలో ‘సెల్కాన్' మొబైల్ కంపెనీకి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు.
చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో నాలుగు సెల్ఫోన్ కంపెనీల హబ్ రావడానికి సెల్కాన్ ఎండీ గురుస్వామి నాయుడు కష్టపడ్డారన్నారు. ప్రభుత్వం తరఫున ఆయన్ను అంబాసిడర్గా ఉండాలని సీఎం కోరారు.
చంద్రబాబు
దేశంలోనే ఏపీ నెంబర్వన్ హార్డ్వేర్ హబ్గా తయారవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు.
చంద్రబాబు
రేణిగుంట సమీపంలో నాలుగు మొబైల్ తయారీ కంపెనీలు రావడం వల్ల ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా మరో 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
చంద్రబాబు
2022 నాటికి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో తిరుగులేని అభివృద్ధిని తీసుకువచ్చి అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తామన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.