జగన్-రోజా ఎఫెక్ట్: వేణు మాధవ్ను బెదిరిస్తూ ఇలా వరుస వీడియోలు!
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసిన నటుడు వేణు మాధవ్కు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఆయన నంద్యాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసిన నటుడు వేణు మాధవ్కు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఆయన నంద్యాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: ఈసీ హెచ్చరిక: చానళ్లకు నంద్యాల 'సర్వే' షాక్, రిజైన్పై అఖిలప్రియ మెలిక
వేణు మాధవ్ను బెదిరిస్తూ కొందరు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లలో వీడియోలు పెట్టారు. ఆయన తొలుత డిజిపికి ఫోన్ ద్వారా తెలిపారు. ఆయన సూచన మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పుడు ఫోన్ చేసి బెదిరింపు
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాం నిమిత్తం వచ్చిన వేణు మాధవ్కు మొదట ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బెదిరింపు వచ్చింది. వైసిపి కార్యకర్తలు తన ఫోన్కు కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని వేణు మాధవ్ చెప్పారు.
Recommended Video
10 నిమిషాల వీడియో
ఆ తర్వాత అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో రాజశేఖర్ రెడ్డి అనే వైసిపి కార్యకర్త వేణు మాధవ్ను దూషిస్తూ 10 నిమిషాల నిడివి గల వీడియోను యూ ట్యూబ్లో పెట్టినట్లు చెప్పారు.
మరొకతను 26 నిమిషాల వీడియో
అనంతరం ఆదివారం మధ్యాహ్నం మరొకతను అసభ్య పదజాలంతో దూషిస్తూ 26 నిమిషాల నిడివిగల వీడియోను యూట్యూబ్లో ఉంచినట్లు చెప్పారు. మరికొందరు చంపుతామని బెదిరించారు
వేణు మాధవ్ ఫిర్యాదు
వైసిపి కార్యకర్తలు చంపుతామని బెదిరిస్తున్నారని వేణమాధవ్ ఆదివారం రాత్రి కర్నూలు రెండోపట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రోజా పైన, జగన్ పైన వేణు మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలోనే ఈ బెదిరింపులు వచ్చాయని భావిస్తున్నారు.