వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బిల్లును ఆమోదించకూడదని రాష్ట్రపతికి ఏపీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు బుదవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు రాష్ట్రపతిని కలిశారు.

2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు. ఈ సవరణలు రైతులకు, కూలీలకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు.

congress party leaders complaint against 2013 land acquisition amendment bill

అయితే ఈ విషయమై న్యాయపరమైన అంశాలను పరిశీలించనున్నట్టు రాష్ట్రపతి హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం స్పూర్తికి విరుద్దంగా టిడిపి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.

రైతులకు ప్రయోజనాలను తగ్గించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కల్గించేలా ఈ సవరణలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

English summary
Andhra pradesh congress party leaders complaint against 2013 land acquisition amendment bill.In the leadership of Divijaysingh congress leaders met president of India on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X