నేపాల్: ఢిల్లీ చేరిన తెలుగు వైద్యవిద్యార్థులతో దత్తాత్రేయ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: భూకంపంతో అతలాకుతలమైన నేపాల్లో చిక్కుకున్న ఏపి, తెలంగాణ యాత్రికులు, పలువురు విద్యార్థులు సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ భవన్ సిబ్బంది వీరిని హైదరాబాద్కు విమానంలో పంపించారు. అంతకుముందు యాత్రికులు, విద్యార్థులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు.
నేపాల్ భూకంపం భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. నేపాల్లో ఎవరైనా తప్పిపోతే ఖాట్మండ్ ఎంబసీకి తెలపాలని సూచించారు. చిట్టచివరి వ్యక్తి సురక్షితంగా స్వరాష్ర్టానికి చేరుకునేంతవరకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని దత్తాత్రేయ తెలిపారు.
బండారు దత్తాత్రేయ
భూకంపంతో అతలాకుతలమైన నేపాల్లో చిక్కుకున్న ఏపి, తెలంగాణ యాత్రికులు, పలువురు విద్యార్థులు సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
ఢిల్లీకి చేరిక
తెలంగాణ భవన్ సిబ్బంది వీరిని హైదరాబాద్కు విమానంలో పంపించారు.
ఢిల్లీకి చేరిక
అంతకుముందు యాత్రికులు, విద్యార్థులను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు.
నేపాల్ భూకంపం భయభ్రాంతులకు గురి చేసిందన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. నేపాల్లో ఎవరైనా తప్పిపోతే ఖాట్మండ్ ఎంబసీకి తెలపాలని సూచించారు.
విదేశాంగశాఖతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. నేపాల్లోని భరత్పూర్లో ఉన్న కాలేజీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్య విద్య అభ్యసిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులు మాత్రం సోమవారం మధ్యాహ్నానికి రైల్లో ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఆరుగురు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందినవారు.