ర్యాగింగ్కు విద్యార్థి బలి
కడప: కడప జిల్లాలో దారుణం జరిగింది. ర్యాగింగ్ కు ఓ విద్యార్థిని బలైంది. కడప జిల్లా బద్వేలుకు చెందిన ఉష నంద్యాల ఆర్.జి.ఎం.కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. కొన్నాళ్లుగా ఆమెపై ర్యాగింగ్ జరుగుతోంది. పరిస్థితి విషమించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. నంద్యాల నుంచి స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఆమె విషం తాగినట్లు సమాచారం. మార్గమధ్యలోనే ఉష స్పృహ తప్పిపడిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కడప ఆసుపత్రికి తరలించారు. ఆయితే అప్పటికే ఉష చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు
Comments
English summary
Engineering Student Suicide in Kurnool district
Story first published: Monday, November 21, 2016, 19:06 [IST]