వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికపై ఫాదర్ లైంగిక దాడి: ముఠా ఏర్పాటు చేసిన పోలీసు చోర్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రార్థనలు చేయిస్తూ భక్తిభావం పెంచాల్సిన ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. పరిశుద్ధబాబు అనే ఫాదర్ అమ్మాయిలను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడనే ఆరోపణలు వచ్చాయి. మచిలీపట్నంలోని మిషనరీ హాస్టల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ఫాదర్‌ పరిశుద్ధబాబు లైంగికంగా వేధించసాగాడు.

బాధిత విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, గొలుసు దొంగతనాలకు పాల్పడిన కృష్ణా జిల్లాలోి కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌కు ఐదేళ్ళు జైలు శిక్ష రూ. 250 జరిమానా విధిస్తూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ వి.శ్రీనివాసమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం గంపలగూడెంకు చెందిన మల్కాపురం కిషోర్‌ కృష్ణలంక స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తుండేవాడు.

Father sexually assaults 9 year old girl

డబ్బుపై దురాశతో ఒక ముఠాను తయారు చేసి 2013 మే, జూన్‌ నెలల్లో ఆరు గొలుసు చోరీలకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసుల విచారణలో కిషోర్‌నే నిందితుడిగా గుర్తించి అతన్ని అరెస్టు చేసి గొలుసులను రికవరీ చేశారు.

అనంతరం కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. కేసు పరిశీలించిన న్యాయమూర్తి ఐదు కేసులలో నిందితుడిపై నేరం రుజువుకావడంతో ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ రూ.250 జరిమానా విధించారు.

English summary
A missionary hostel father sexually assaulted against a girl in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X