రెండో భార్య దగ్గరకు వెళ్లేందుకు కొడుకును కట్టేసి.. తండ్రి దారుణం
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి రెండో భార్య వద్దకు వెళ్లేందుకు తన కొడుకును ఇంట్లోనే అయిదు రోజుల పాటు బంధించాడు.
అతనిని కట్టేసి వెళ్లడంతో నరకయాతన అనుభవించాడు. నిందితుడైన ఆ తండ్రి పేరు సులేమన్. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య కొడుకును ఇంట్లోని చీకటి గదిలో కట్టేసి రెండో భార్య వద్దకు వెళ్లాడు.
స్థానికులు దీనిని ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు ఆ బాలుడిని బయటకు తీసుకు వచ్చారు. తండ్రి సులేమన్పై కేసు నమోదు చేశారు.
Comments
English summary
A Father from Nandyal in Kurnool district tied his son in house for five days.
Story first published: Thursday, April 20, 2017, 12:44 [IST]