విషాదం: 4గురు పిల్లల మృతి, తెలిసి అమ్మమ్మ
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఆదివారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వేటపాలెం మండలం రామాపురంలో చేపల వేటకు అని వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాధ వార్త విన్న అమ్మమ్మ అక్కడికి అక్కడే కుప్పకూలిపోయింది. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు.
మృతులను సుజాత, అంజమ్మ, రాముడు, ఆంజనేయులులు ఉన్నారు. మృతులు తొమ్మిది నుండి పన్నెండేళ్ల వయస్సు వారే. వీరి మరణ వార్త తెలియగానే అమ్మమ్మ కూడా మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఇందరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి
విజయనగరం జిల్లా కేఎల్ పురం సమీపంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జయదేవ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 'స్వచ్చ్ భారత్ అభియాన్'లో ఎంపీ గల్లా జయదేవ్ శనివారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా గుంటూరులో ఆయన మొక్కలు నాటారు. అటు తుపాను బాధితులకు దక్కన్ టొబాకో లారీ బియ్యం, రూ.2 లక్షల విరాళాన్ని ఎంపీకి అందజేసింది.
40కి చేరిన హుదూద్ తుపాను మృతులు
హుదూద్ తుపాను విలయానికి మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరుకుంది. విశాఖ జిల్లాలో 27 మంది, విజయనగరం జిల్లాలో 12 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.