ఫాంహౌస్లో స్టీఫెనా, సెక్షన్8 ఉంటే ప్రొపెసర్పై దాడి జరిగేదా: గాలి, కేంద్రమంత్రితో బాబు
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఫాంహౌస్లో పెట్టుకొని గూడుపుఠాణీ చేస్తున్నారని ఏపీ టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో కీలక సాక్షిని కేసీఆర్ తన వద్ద అట్టిపెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పారు.
తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయిందని మండిపడ్డారు. మే 21న హోటల్లో జగన్, తెరాస నేతలు కలిశారని తమకు సమాచారం ఉందని చెప్పారు. సెక్షన్ 8ను ఎట్టి పరిస్థితుల్లోను అమలు చేయాల్సిందే అన్నారు.
సెక్షన్ 8 కోసం తాము కొత్తగా ఏమీ డిమాండ్ చేయడం లేదని, నిరుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. గవర్నర్కు అధికారాలు ఉంటే జేఎన్టీయూలో ప్రొఫెసర్ పైన దాడి జరిగేదా అని నిలదీశారు.
కేంద్రమంత్రితో చంద్రబాబు భేటీ
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్తో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విశాఖ రానున్నారు. పెట్రోలియం నిల్వలను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం కేజీ బేసిన్లో పర్యటిస్తారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అవుతారు.