తెలంగాణ ఏపీని ఇబ్బందిపెడుతోంది: గాలి, మోడీపైనా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏమాత్రం స్పష్టత లేదన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు.
పూడికతీత పనులు ప్రారంభించిన సునీత
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కట్టకిందపల్లిలో చెరువులో మంత్రి పరిటాల సునీత బుధవారం పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ, పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
జగన్ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అని ఆ పార్టీ నేత గోవింద రెడ్డి అన్నారు. ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో తాను గతంలో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఖరారు చేశారని చెప్పారు.