బాపుఘాట్ వద్ద గవర్నర్, కెసిఆర్..నివాళి: లోటస్పాండ్లో జగన్(పిక్చర్స్)
హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. మహాత్ముడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ను విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛ భారత్ అమలులో తెలుగు రాష్ట్రాలు ముందుండాలన్నారు.
తెలంగాణ మంత్రులు హరీశ్రావు, ఈటెలరాజేందర్, కడియంశ్రీహరి, మహేందర్రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు తదితరులు బాపూఘాట్ వద్ద నివాళులర్పించారు. కాగా, లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
దత్తాత్రేయ
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
నివాళి
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. మహాత్ముడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
నివాళి
స్వచ్ఛ భారత్ను విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛ భారత్ అమలులో తెలుగు రాష్ట్రాలు ముందుండాలన్నారు.
నివాళి
తెలంగాణ మంత్రులు హరీశ్రావు, ఈటెలరాజేందర్, కడియంశ్రీహరి, మహేందర్రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు తదితరులు బాపూఘాట్ వద్ద నివాళులర్పించారు.
నివాళి
టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు తదితరులు బాపూఘాట్ వద్ద నివాళులర్పించారు.
నివాళి
లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.