3వారాల్లో పూర్తి చేయండి, సీబీఐకి నో: శేషాచలం ఎన్కౌంటర్పై హైకోర్టు
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ పైన దర్యాఫ్తును 3 వారాల్లోగా పూర్తి చేయాలని ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్)ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత సమయంలో ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించలేమని చెప్పింది.
శేషాచలం ఎన్ కౌంటర్ పైన సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పైన మీ వద్ద ఉన్న ఆధారాలేమిటని హైకోర్టు పిటిషన్ దారును ప్రశ్నించింది.
కొద్ది నెలల క్రితం చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్లో 20 మందిని పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీలు తమిళనాడుకు చెందిన వారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
శేషాచలం ఎన్కౌంటర్లో తమిళనాడు కూలీలు మృతి చెందడంతో నాడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్డర్లో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. తమిళనాడులో తెలుగు వారి పైన దాడులు జరిగాయి. శేషాచలం ఎన్కౌంటర్ పైన సిట్ ఏర్పాటు చేశారు. దీనిని సిట్ విచారిస్తోంది.