నాది బాబు వర్సీటీ: 'ఎన్టీఆర్ వర్సీటి'పై గంటా కౌంటర్
విశాఖ: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు మాటల యుద్ధం సాగిస్తున్నారు. తాను ఎన్టీఆర్ వర్సిటీ నుండి వచ్చానని అయ్యన్న చెబితే, గంటా అందుకు కౌంటర్ ఇచ్చారు. తాను చంద్రబాబు వర్సిటీ నుండి వచ్చానని చెప్పారు.
విశాఖపట్నం నగరంలో రూ.25లక్షలతో విద్యాభవన్కు భూమిపూజ చేసిన అనంతరం గంటా మాట్లాడారు. నేడు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఎంసెట్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఎస్సీ, క్లాట్ పరీక్షల నేపథ్యంలో అన్నీ ఒకేసారి నిర్వహిస్తే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందన్నారు. తనకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో పని చేసే అదృష్టం రాలేదన్నారు. తనది చంద్రబాబు స్కూల్ అని వ్యాఖ్యానించారు.
యనమల, ముఖ్య అధికారులతో చంద్రబాబు భేటీ
ఆర్థిమంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం 11గంటలకు భేటీ కానున్నారు. ఏడో తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో అధికారులతో చర్చించాల్సిన విషయాలపైనా కసరత్తు చేయనున్నారు.