వైసీపీకి షాక్: మంత్రి ఫిర్యాదు చేస్తే రోజాపై చర్యలు: నన్నపనేని
నంద్యాల:వైసీపీ ఎమ్మెల్యే రోజా..ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు.
''రోజాది చింతామణి క్యారెక్టర్, ఆల్కహల్ టెస్ట్ చేయాలి'', ''బాబు చెంచాలకు ఉలికిపాటు''
ఆమె నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. మంత్రి అఖిలప్రియపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైందికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అఖిలప్రియ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామని చెప్పారు.
మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు నన్నపనేని రాజకుమారి. చుడీదార్ వస్త్రాలను దరించడంలో తప్పేమీ లేదన్నారు.
ఉత్తరాదిలో ఎక్కువగా మహిళలు చుడీదార్లే ధరిస్తారనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చుడీదార్ వేసుకొన్న మహిళలందదిరినీ కూడ రోజా విమర్శించినట్టే భావించాల్సి వస్తోందన్నారామె.