వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిషేధాన్ని ఎత్తేసిన ఇండిగో: జేసీ దివాకర్ రెడ్డికి ఊరట
తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బుధవారం ఊరట లభించింది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బుధవారం ఊరట లభించింది. ఇండిగో ఎయిర్ లైన్స్ ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.
జెసికి షాక్: 'దివాకర్ ట్రావెల్స్లో ఇలా జరిగితే అనుమతిస్తారా?'
గతంలో విశాఖ విమానాశ్రయంలో జేసీ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఇండిగో ఆయనపై నిషేధం విధించింది. పలు విమానయన సంస్థలు కూడా ఆయనపై నిషేధం విధించాయి.
దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురయింది. మీ ట్రావెల్స్ బస్సులోని ప్రయాణీకులు ఇలాగే వ్యవహరిస్తే ఊరుకుంటారా అని న్యాయస్థానం నిలదీసింది.
నిషేధం నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీలో ఓటు వేయడానికి జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా చార్టర్డ్ ప్లైట్లో వెళ్లారు. ఇందుకు రూ.7 లక్షల వరకు ఖర్చు అయింది.
Comments
jc diwakar reddy indigo airlines telugu desam andhra pradesh జెసి దివాకర్ రెడ్డి ఇండిగో విమానాశ్రయం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్
English summary
Indigo airlines on Wednesday lifted ban on Telugu Desam Party leader and Anantapur MP JC Diwakar Reddy.
Story first published: Wednesday, July 19, 2017, 16:12 [IST]