వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.5కి టీ తాగుతున్నారు, రూ.1కు బియ్యం ఎందుకు: జెసి సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.5 పెట్టి చాయ్ కొంటున్నప్పుడు రూపాయికే చౌక ధర బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.

ఆయన ఆదివారం మాట్లాడుతూ... పేదలకు రూపాయికే బియ్యం అందించడాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ టీ తాగేందుకు రూ.5 వేచ్చిస్తున్నారన్నారు. అలాంటప్పుడు కిలో బియ్యాన్ని రూపాయికే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

JC Diwakar Reddy questions Rs 1 KG rice scheme

రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కూడా తగ్గాలని అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. జెసి దివాకర్ రెడ్డి ఎప్పుడూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తుంటారు.

చింతలపూడి ఎత్తిపోతలకు భూములు సేకరించాం: సుజాత

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు 80 శాతం భూములను సేకరించామని మంత్రి పీతల సుజాత ఆదివారం అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారన్నారు.

English summary
Telugudesam Party MP JC Diwakar Reddy has questioned Rs 1 KG rice scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X