కేశవరెడ్డి కిడ్నాప్ కలకలం..... క్షేమంగా ఉన్నానంటూ స్వయంగా ఆయనే ప్రకటన
కర్నూలు: ప్రముఖ కేశవరెడ్డి విద్యా సంస్ధల అధిపతి కేశవరెడ్డి కిడ్నాప్కు గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కేశవరెడ్డి కిడ్నాప్కు గురయ్యారంటూ పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ కిడ్నాప్ కలకలం రేగింది.
బనగానపల్లెకు చెందిన కొందరు వ్యక్తులు ఆయన్ని కిడ్నాప్ చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కిడ్నాప్ విషయంపై స్వయంగా కేశవరెడ్డి వివరణ ఇచ్చారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు.
బంధువుల ఇంటికి వెళుతుంటే కిడ్నాప్ అయ్యాయని భావించారని తెలిపారు. ఈ వ్యవహారంలో స్పందంచిన పోలీసులు ప్రస్తుతం కేశవరెడ్డి తమ ఆధీనంలో ఉన్నాడని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పలు పట్టణాల్లో కేశవరెడ్డికి చెందిన విద్యాసంస్ధలు ఉన్నాయి.
Comments
English summary
keshava reddy schools chairman Keshava reddy kidnap at banaganapalli in Karnool.