అర్థం చేసుకోండి!: హరీష్కు కిషన్ కౌంటర్, బాబుకు కొత్త కాన్వాయ్
హైదరాబాద్: తాము మిషన్ కాకతీయను వ్యతిరేకించలేదని, అందులోను లోటుపాట్లు ఎత్తి చూపామని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదివారం మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. పథకంలోని లోపాలను తాము ఎత్తి చూపామన్నారు.
మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలు చెబుతున్నారు తప్ప చేతల్లో చూపించట్లేదని ఎద్దేవా చేశారు. కలెక్టర్ల సమావేశంలోనూ కేసీఆర్ వన్ మ్యాన్ షోగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
మిషన్ కాకతీయలో అవినీతి జరిగితే తమ దృష్టికి తీసుకు రావాలని ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. గ్రామాల అభివృద్ధిలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మిషన్ కాకతీయకు జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుదన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
సీఎం చంద్రబాబుకు కొత్త కాన్వాయ్
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వాడేందుకు సీఎం చంద్రబాబుకు కొత్త కాన్వాయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జామర్తో సహా ఎనిమిది కొత్త టాటా సఫారీఅను కొనుగోలు చేసింది. కొత్త వాహనాల్లో రెండు ప్రాడో, ఆరు ఫార్చూనర్ వాహనాలు ఉన్నాయి.