వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నగ్నంగా వీడియో తీసి సాయి శ్రీనివాస్ కృపామణిని బెదిరించాడు'

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన వివాహిత కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ తాను చేసిన పనిని అంగీకరించాడని పోలీసులు చెప్పారు. కృపామణిని నగ్నంగా వీడియో తీసి బెదిరించినట్లు సాయి శ్రీనివాస్ అంగీకరించినట్లు తెలిపారు.

వీడియోలు నెట్‌లో పెడతానని గుడాల సాయి శ్రీనివాస్ బెదిరించడం వల్లనే కృపామణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. గుడాల సాయి శ్రీనివాస్‌ను పోలీసులు శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Krupamani

కృపామణి భర్తపై పెట్టిన కేసు పరిష్కారం కోసం సాయి శ్రీనివాస్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడని ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లతో డబ్బులు గుంజడం శ్రీనివాస్‌కు అలవాటు అని కూడా చెప్పారు. నిందితుడి నుంచి రెండు కార్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

తణుకు అస్పత్రిలో నిందితుడు గుడాల శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తణుకుకు చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌తో పాటు తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రం వేధించడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణిలో సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి కాలువల పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
Police said that main accused in Krupamani suicide case Gudala Sai Srinivas has ageed his act. Jrupamani commited suicide in West Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X