వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: కెవిపి

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరందిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అపర భగీరథుడు అనే బిరుదును ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరందిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అపర భగీరథుడు అనే బిరుదును ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపి కెవిపి రామచంద్రరావు అన్నారు.

2004కు ముందు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడింది చంద్రబాబునాయుడేనని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు ఏం చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు.

kvp challenges to chandrababu naidu on Polavaram

తనకు ఆర్థికశాస్త్రంలో ఉన్న ప్రావీణ్యాన్ని ఉపయోగించి రాష్ట్రానికి లాభాలు వచ్చే మార్గాలను చూడాలని కెవిపి రామచంద్రరావు చంద్రబాబుకు సూచించారు.

పోలవరం ప్రాజెక్టును అడ్డుకొంటున్నానని తనపై చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కెవిపి రామచంద్రరావు చెప్పారు. తనపై చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటానని కెవిపి చంద్రబాబుకు సవాల్ విసిరారు.

English summary
I never trying to stop Polavaram project, if Chandrababu naidu prove his allegations I will resign challenged Congress leader,Mp KVP Ramachandra rao on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X