హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూర్ బస్సు ఎక్కిన మహిళా టెక్కీ అదృశ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Lady techie missing in Hyderabad
హైదరాబాద్: కర్ణాటక రాజధాని బెంగళూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది. హైదరాబాదులోని అఫ్జల్‌గంజ్ ఎస్సై చంద్రశేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. అత్తాపూర్ హుడా కాలనీకి చెందిన పి. మోహన్ రావు కూతురు భరణి (26) బెంగళూర్‌లోని ఓ కంపెనీలో కొంత కాలంగా పనిచేస్తోంది.

అక్టోబర్ 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజిబిఎస్‌లో బెంగళూర్ వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న భరణికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళనకు గురైన ఆయన అర్థరాత్రి వరకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది.

దాంతో మరుసటి రోజు బెంగళూర్‌లో ఆమె పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేశాడు. అయితే, భరణి రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధుమిత్రుల ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదువుపై ఇష్టం లేని యువతి ఆత్మహత్య

చదువుపై అయిష్టతతో ఓ యువతి తన నిండు ప్రాణాలను తీసుకుంది. తనకు చదువు అంటే ఇష్టం లేదంటూ విజయవాడ శ్రీచైతన్య కళాశాలలోని శాంతాభవన్‌ క్యాంపస్‌లో శ్రీవిద్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ స్వస్థలం కడప జిల్లా.

పోలీసులకు ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. చదువుకోవడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఆమె తన ఆత్మహత్య లేఖలో చెప్పింది. శ్రీవిద్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.

English summary
A lady techie from Hyderabad is missing after started to Bangalore bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X