వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాలి హత్య, పదేళ్ల జైలు: అత్తారింటికని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రియురాలిని నమ్మించి హతమార్చిన కేసులో ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. రాజానగరం గ్రామానికి చెందిన రామాంజనేయులుకు కోర్టు జీవిత ఖైదు, రూ.51వేల జరిమానా విధించింది.

రైలు ప్రయాణంలో తూరంగి గ్రామానికి చెందిన శ్రీదేవితో నిందితుడు రామాంజనేయులుకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇరు పక్షాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐతే ఆ యువతికి గతంలో పెళ్లి జరిగిందని, అనారోగ్యం నేపథ్యంలో ఆమె భర్త విడాకులు ఇచ్చినట్టు రామాంజనేయులు తెలుసుకున్నాడు.

Lifetime sentence to youth

ఈ నేపథ్యంలో ఆమెను హత మార్చాలని పథకం ప్రకారం 2012 జూలై 18న గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం రవ్వారం గ్రామానికి తీసుకు వెళ్ళి శీతల పానీయంలో మత్తు మాత్రలు వేసి ఆమెకు తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన నేపథ్యంలో ఆమె చున్నీతోనే గొంతుకు ఉరి వేసి చంపాడు. ఈ కేసులో రామాంజనేయులుపై నేరం రుజువు కాగా జీవిత ఖైదు విధించారు.

వివాహిత అదృశ్యం

ఒంగోలు పట్టణంలోని గోపాల నగర్ 3వ లైన్లో నివసించే వివాహిత అదే ప్రాంతంలో ఆమె మేనత్త కొడుకుతో జనవరి నెలలో వివాహం అయింది. భర్తతో విభేదాలతో ఆ వివాహిత పుట్టింట్లో ఉంటోంది. తాను అత్తారింటికి వెళ్తున్నానని ఆదివారం నాడు పుట్టింట్లో చెప్పి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Lifetime sentence to youth in Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X