విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలికపై మేనమామ రేప్: నాలుగేళ్ల చిన్నారిపై..

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంక గ్రామంలో దారుణం జరిగింది.
సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ బాలికపై స్వయాన మేనమామే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై రాజీయత్నాలు ఫలించకపోవడంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 A man allegedly raped his niece

నాలుగేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారయత్నం

చిత్తూరు: అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెదరాంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పెదరాంపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లి దండ్రులు బతకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లడంతో అమ్మమ్మ వద్ద ఉంటోంది.

ఈ క్రమంలో గ్రామానికి చెందిన శీనయ్య(25) అనే యువకుడు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు విన్న కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యేసరికి అతను అక్కడి నుంచి జారుకున్నాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటిపై తెగిపడ్డ హైటెన్షన్ వైరు: ముగ్గురి మృతి

విజయవాడ: నగరంలోని బంటుమిల్లి మండలం ముంజులూరులో సోమవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుద్ఘాతంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. మంజులూరులో భారీగా వీసిన ఈదురుగాలులకు హైటెన్షన్ వైరు ఇంటిపై తెగిపడింది.

హైటెన్షన్ వైరు నుంచి ఇంటికి విద్యుత్ ప్రవహించడంతో ఇంట్లో వారంతా విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A man allegedly raped his niece in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X